Operation Sindoor: ఆపరేషన్ సింధూర్..ఇక మూసుకొని కూర్చోండి…పాక్ ను హెచ్చరించిన అమెరికా!

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత ప్రభుత్వం చర్యలను పూర్తిస్థాయిలో తప్పు పట్టడమే కాకుండా ఈ ఉగ్ర దాడి వెనుక పాక్ ప్రేరేపితం ఉందని కూడా ఆరోపణలు చేశారు అంతేకాకుండా ఈ ఉగ్ర దాడికి పాకిస్తాన్ పై తప్పనిసరిగా ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇందులో భాగంగానే మంగళవారం అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేయడమే కాకుండా ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశారు.

ఇలా భారత్ ఒక్కసారిగా మెరుపు దాడి చేయడంతో పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టింది. అయితే మొదటి నుంచి కూడా ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఇతర దేశాలు భారత ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేశాయి. ముఖ్యంగా అమెరికా ఇస్రాయిల్ వంటి దేశాలు మొదటి నుంచి కూడా భారత్ కు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపాయి. ఈ క్రమంలోనే ఈ ఉగ్రదాడి అనంతరం అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో.. ఆయన పాకిస్తాన్ జాతీయ భద్రత సలహాదారుతో మాట్లాడుతూ కీప్ క్వైట్అని చెప్పినట్లు తెలుస్తోంది.

భారత్ పై పాకిస్థానీయులు చేసిన దొంగ దెబ్బకు ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే హక్కు భారత్ కి పూర్తిగా ఉంది. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విషయంపై పాకిస్తాన్ మౌనంగా ఉండటమే మంచిదని తెలిపారు. అలా కాకుండా భారత్ పై యుద్ధం ప్రకటించే సాహసం చేస్తే మరిన్ని చర్యలు తప్పవని అలాంటి సాహసం చేయకపోవటమే మంచిదని పాకిస్తాన్ భద్రతా సలహాదారుకి అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో చెప్పారు.

ఇలా పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయటం సరైన నిర్ణయమే అంటూ భారత్ కి అమెరికాతో పాటు ఇజ్రాయిల్ కూడా మద్దతు ప్రకటించడం విశేషం. అయితే ఈ దాడిలో పాకిస్తాన్ ప్రజలపై భారత్ ఎక్కడ కూడా దాడి చేయలేదు కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేస్తూ ఉగ్రవాదులను మట్టుపెట్టే ప్రయత్నం చేసిందని చెప్పాలి ఈ విషయం గురించి కూడా భారత్ కీలక ప్రకటనలు చేసింది.