నేర చరిత్ర ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని అంబేద్కర్ ముందే ఊహించలేదు: రఘురామకృష్ణరాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 4వ తేదీన తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అని.. దాంతో ఆయన కూడా వెళ్లాల్సి ఉందని వారితో అన్నారు.

ఈ నేపథ్యంలో తనకు అవసరమైనంత భద్రత కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇటీవలే విశాఖపట్నంలో జరిగిన మీటింగ్ కు వెళ్లాలనుకుంటే అక్కడకు తనను రానివ్వలేదని అన్నారు. అంతేకాకుండా నేర చరిత్ర ఉన్నవాళ్లు ముఖ్యమంత్రి అవుతారని అంబేద్కర్ ముందే ఊహించలేదు అని అన్నారు.