Amaravathi: అమరావతి బాధ్యతలను ఆ నేతకు అప్పగించిన జగన్…. జగన్ టార్గెట్ అదేనా?

Amaravathi: వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొని కొన్ని నిర్ణయాలు ఎంతో ఆశ్చర్యకరంగాను , ఆసక్తికరంగాను ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలను అమలుపరుస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో రాజధాని అంశం కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో ప్రకటించినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి శంకుస్థాపన కార్యక్రమాలను కూడా చేశారు.

ఇలా అమరావతి రాజధానిని అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు కానీ అమరావతిని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతిని కాకుండా మూడు రాజదానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇక ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం 2024 ఎన్నికలలో ఓటమి పాలవ్వటానికి కూడా కారణమైనదనే చెప్పాలి.

అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి సేవలను వినియోగించుకున్నారు. అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు రైతులు. కానీ అక్కడక్కడ కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అటువంటి వారిని కూడా తీసుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయించేవారు. కోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు వచ్చేవి. దీంతో దానిపై విస్తృతంగా ప్రచారం చేసేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఇప్పుడు తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతి పునర్నిర్మాణ పనులను చేపట్టారు. దీంతో మరోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డికి అమరావతి బాధ్యతలను జగన్ అప్పగించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ల పై విమర్శలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణాన్ని ఆపలేకుండా పార్లమెంట్లో చట్టం చేయనున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే అమరావతి నిర్మాణంలో అవినీతి, వైఫల్యాలను బయటకు తీసే బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్టు తెలుస్తోంది.