Allu Arjun Gets Trolled : ‘పుష్ప’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏం లాభం.? అంతా పబ్లిసిటీ పైత్యమేనంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది. ‘పీఆర్ మాఫియా అల్లు అర్జున్’ అంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ షురూ అయ్యింది.
నిజానికి, అల్లు అర్జున్ విషయంలో ఇలా ట్రోలింగ్ జరగడం ఇదే కొత్త కాదు. తన ప్రతి సినిమా విషయంలోనూ అల్లు అర్జున్ పీఆర్ టీమ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వుంది. చాలామంది హీరోలు ఇలా పీఆర్ టీమ్స్ ద్వారా తమ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని తప్పుపట్టగలమా.? అన్నది వేరే చర్చ.
ప్రధానంగా టాలీవుడ్కి సంబంధించి ఈ పీఆర్ ఆరోపణలు అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ తదితర హీరోల విషయంలో వినిపిస్తుంటుంది. అయితే, కేవలం పీఆర్ ద్వారానే హీరోల ఇమేజ్ పెరుగుతుందంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
‘పుష్ప’ సినిమాకి తొలి రోజు టాక్ మిక్స్డ్గా వచ్చినా, బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమాని కొనియాడ్డంతో.. మౌత్ టాక్ వల్లనే బంపర్ విక్టరీ అందుకుంది. అల్లు అర్జున్ రిస్కీ అటెంప్ట్ చేశాడు.. హిట్టుకొట్టాడు. వందల కోట్ల వసూళ్ళంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సినిమా సాధించిన అసలు విజయం కనుమరుగైపోతోంది.
బహుశా అందుకేనేమో, పీఆర్ మాఫియా.. అనే ఆరోపణల్ని అల్లు అర్జున్ ఎదుర్కోవాల్సి వస్తోంది.
