Sree Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాట….శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్… పరిస్థితి ఏంటంటే?

Sree Tej: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించిన విషయం తెలిసిందే. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడ్డారు. దీంతో శ్రీతేజ్ గత 6 నెలలుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు.

ఇక ఈ చిన్నారికి హాస్పిటల్ ఖర్చులను అటు ప్రభుత్వంతో పాటు ఇటు అల్లు కుటుంబ సభ్యులు కూడా పెట్టుకుంటున్నారు. అదేవిధంగా చిన్నారి శ్రీ తేజ్ పేరు మీద నటుడు అల్లు అర్జున్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ క్రమక్రమంగా కోలుకుంటున్నారని తెలుస్తుంది.ఇటీవల కిమ్స్ ఆస్పత్రి నుంచి బాలుడు శ్రీ తేజ్ డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతని శరీరంలో కదలికలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిజియోథెరపీ హాస్పిటల్ లో చేర్పించారు.

15 రోజులపాటు ఫిజియోథెరపీ అప్లై చేస్తే శ్రీ తేజ్ కోలుకుంటాడని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే.. చిన్నారి శ్రీతేజ్ ను పరామర్శించడం కోసం అల్లు అరవింద్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ చిన్నారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చిన్నారికి ఎంత ఖర్చయినా పర్వాలేదని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు అల్లు అరవింద్ చెప్పినట్టు సమాచారం. ఇలా అల్లు అరవింద్ తో పాటు మరో నిర్మాత బన్నీ వాసు కూడా హాస్పిటల్ కి వెళ్లి చిన్నారి శ్రీ తేజ్ ను పరామర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.