Telugu Indian Idol: క్లైమాక్స్ కి చేరిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌..ప్రేక్షకుల అంచనాల అందుకుందా..?

Telugu Indian Idol: బుల్లితెర మీద కామెడీ, డాన్సు, సింగింగ్ వంటిఎన్నో రియాలిటీ షో లో ప్రసారం అవుతున్నాయి. ఈ షో ల ద్వార ఎంతో మంది తమలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఇండియన్ ఐడల్ షో కూడా తెలుగులో ప్రారంభమయ్యింది. ఈ షో ని ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ప్రసారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో భాషలలో ప్రసారమైన ఈ ఇండియన్ ఐడల్ సింగింగ్ షో తాజాగా తెలుగులో కూడా ప్రారంభం అయింది. మంచి గుర్తింపు పొందిన ఈ రియాలిటీ షో లో మన తెలుగు సింగర్స్ కూడా పాల్గొన్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్ షో కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జ్ లుగా వ్యవహరించారు. అయితే ఈ సింగింగ్ షో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ షో విషయంలో తమన్ కూడా కొంతవరకు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం వారు అనుకున్న స్థాయిలో ఈ షో కి ప్రేక్షకాదరణ లభించలేదు. అందువల్ల తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కి తమన్ నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం
ఓటీటీకి భారీగా ఆదరణ ఉంది. బుల్లి తెర మీద కాకుండా ఓటిటి లో ఈ షో ప్రచారం చేసినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ క్లైమాక్స్ ఎపిసోడ్ కి నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశాడు. ఈ షోలో ఆరు మంది కంటెస్టెంట్ లు ఫైనల్ వరకు చేరుకున్నారు. గ్రాండ్ ఫినాలే రోజున బాలకృష్ణ ఈ 6 మంది కంటెస్టెంట్ లో పాటలు విని ఒక్కరికీ మాత్రమే టైటిల్ అందించనున్నాడు. గతంతో ఆహాలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ని హోస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఆ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. దీంతో ఓటీటీ లో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ షో ప్రేక్షకులను నిరాశ పరిచింది అని చెప్పటంలో సందేహం లేదు.