Allu Arjun : “పుష్ప” తర్వాత లాస్ట్ మినిట్ లో రిలీజ్ ఆగిపోయిన బన్నీ మరో సినిమా.!

Allu Arjun : లేటెస్ట్ టాలీవుడ్ హిట్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప పార్ట్ 1” కూడా ఒకటి. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల్లో సాలిడ్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రం రిలీజ్ తో అల్లు అర్జున్ ఊహించని గిఫ్ట్ నే అందుకున్నాడని చెప్పాలి. తాను కూడా ముందు అనుకోని విధంగా హిందీ ఆడియెన్స్ లో పుష్ప హిట్ ని అందుకున్నాడు. దీనితో ఈ భారీ హిట్ అనంతరం తన మరో హిట్ సినిమా అయినటువంటి “అల వైకుంఠపురములో” సినిమాని కూడా ఇదే హిందీలో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు.

ఆల్రెడీ హిందీ డబ్బింగ్ పనులు కూడా ముగిసి రిలీజ్ కి డేట్ కూడా తెచ్చుకొని భారీ స్థాయిలో స్క్రీన్స్ లాక్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఆగిపోయింది. మరి దీనికి గల కారణం కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమాని ఆల్రెడీ నిర్మాతలు హిందీ రీమేక్ కి అమ్మేసిన సంగతి తెలిసిందే.

అలాంటప్పుడు ఆ సినిమాని కొనుకున్న హిందీ నిర్మాతలు ఒరిజినల్ ని హిందీ డబ్ లో ఎలా రిలీజ్ చేస్తారని విడుదల ఆపాలని కోరారట. దీనితో హిందీలో రిలీజ్ చేయాల్సిన గోల్డ్ మైన్స్ వారు లాస్ట్ మినిట్ లో ఆపేసుకున్నారు. దీనితో అల వైకుంఠపురములో హిందీ సినిమా “సెహ్ జాదా” కి లైన్ క్లియర్ అయ్యింది.