Dhanush – Aishwarya:ధనుష్ తో విడాకుల తర్వాత ఐశ్వర్య ఏం చేయనుందంటే?

Dhanush – Aishwarya: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, భార్య ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. వారిద్దరు విడాకులు తీసుకుంటున్నారు అని తెలుసుకున్న అభిమానులు షాక్ కు గురయ్యారు. దాదాపుగా 18 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని పంచుకున్న ఆ దంపతులు విడిపోతారు అని అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు గానీ ఊహించలేదు. ఇకపోతే ఐశ్వర్య, ధనుష్ మధ్య గతంలో పలు మనస్పర్థలు వచ్చి, విడిపోవడం లాంటివి జరిగాయి అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ధనుష్ తండ్రి కస్తూరి రాజా ధనుష్ కొడుకు కోడలు మళ్లీ కలుస్తారు అంటూ కామెంట్ చేయగా.. అభిమానులను కూల్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పారు అని అభిమానులు భావిస్తున్నారు. వీరిద్దరి విడాకుల విషయం నిజం కాకపోతే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ చేస్తున్న ప్రకటనల ద్వారా కూడా సామాన్య ప్రజల జీవనం పై ప్రభావం చూపే ఛాన్స్ ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. ఈనెల 17వ తేదీన అర్ధరాత్రి సమయంలో సోషల్ మీడియా ద్వారా వీరిద్దరూ విడాకుల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక విడాకులు తరువాత ఐశ్వర్య షూటింగ్ లో బిజీ అయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య దర్శకత్వంలో వాలెంటైన్స్ డే స్పెషల్ సాంగ్ తెరకెక్కనుంది అని తెలుస్తోంది. ఈ పాటను తెరకెక్కించే ఈ క్రమంలోనే ఐశ్వర్య బిజీ అయ్యారు అని తెలుస్తోంది. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ మరొక రెండు రోజుల్లో మొదలు కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐశ్వర్య విడిపోయిన విషయం గురించి కాకుండా పూర్తిగా ఆ సాంగ్ పై దృష్టి పెట్టారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేన అరోరా ఈ సాంగు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.