ఇండస్ట్రీ టాక్ : చంద్రబాబు తర్వాత బాలయ్య షోలో కనిపించేది వీరే.!?

రీసెంట్ గా టాలీవుడ్ సహా రాజకీయ వర్గాల్లో కూడా సెన్సేషన్ గా మారినటువంటి అంశం నందమూరి నటసింహ బాలయ్య మరియు మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే నారా లోకేష్ లతో ప్లాన్ చేసిన ఆహా ప్రసారం చేసే “అన్ స్టాప్పబుల్ సీజన్ 2” మొదటి ఎపిసోడ్ తో అదరగొట్టారు.

ఇక ఈ ఎపిసోడ్ కి అయితే ఒక్క రోజులోనే 10 లక్షలకి పైగా వ్యూస్ వచ్చి ఆల్ టైం రికార్డు అందుకోగా ఇప్పుడు అందరిలో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి ఎపిసోడ్ మాత్రం అంత రేంజ్ లో ప్లాన్ చేయలేదట.

ఈసారి ఇద్దరు యువ హీరోలు బాలయ్య తో కలిసి రచ్చ చేయనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ హీరోలు మరెవరో కూడా కాదని తెలుస్తుంది. ఒకరు లేటెస్ట్ సెన్సేషన్ హిట్ డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ కాగా..

మరొకరు అయితే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న మరో హీరో విశ్వక్ సేన్ కూడా అట. ఆల్రెడీ దీనిపై బాలయ్య కూడా హింట్ ఇవ్వడంతో అందరికి వీరే రానున్నారు అన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుంది అనే ఇతర వివరాలు బయటకి రావాల్సి ఉన్నాయి.