లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని రాష్ర్టాల్లో ఇంకా దుకాణాలు తెరుచుకోని పరిస్థితి. ఏపీ-తెలంగాణల్లో మద్యం లేకపోతే జనాలు ఇబ్బందిని గుర్తించి ఇక్కడ వాటిని ఓపెన్ చేసారు. కానీ ఇంకా చాలా రాష్ర్టాలో మద్యం షాపులను ఓపెన్ చేయలేదు. దీంతోమందు బాబులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా కేరళలోనూ లాక్ డౌన్ కొనసాగుతోంది. అక్కడ ఎలాంటి సడలింపులు లేకుండా ప్రభుత్వం అన్నింటికీ తాళాలు వేసి..అందర్నీ ఇళ్లకే పరిమితం చేసింది.
ఈ నేపథ్యంలో సీరియల్ నటి డబ్బు సంపాదనకు ఆశపడి అక్రమంగా నాటుసారా వ్యాపారం మొదలు పెట్టింది. కేరళలోని నెయ్యటింకర ప్రాంతంలో సారా తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులకు ఆ నటి, విశాక్ అనే మరో వ్యక్తి దొరికిపోయారు. పోలీసులు ఇద్దరిపై కేసులు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నటి సారా కాయడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. నటిగా మంచి జీవితం ఉండగా ఇవేం పనులని ఆమెను అక్కడ హెచ్చరించారు.
అయితే ఆ నటి అక్కడికి ఏదో పనిమీద వచ్చానని పోలీసుల్ని బుకాయించే ప్రయత్నం చేసిందిట. చెంబూరుకు చెందిన ఆ నాటి పలు టీవీ సీరియళ్లు, సినిమాలు చేసింది. విశాక్ అనే వ్యక్తిపై గతంలోనే ఓ మర్డర్ కేసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కోలీవుడ్ లో ఓ నిర్మాత అక్రమంగా ఎర్ర చందనం వ్యాపారం చేస్తూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఇలా తవ్వితే అక్రమంగా సంపాదించి సినిమాల్లో పెట్టుబడులు పెట్టిన వారి జాబితా కూడా పెద్దదే ఉంటుంది.