Sad Incident: ఆవేశంలో బంగారు జీవితాన్ని నాశనం చేసుకున్న యువతి.. ప్రేమే కారణమా?

Sad Incident:సాధారణంగా చాలా మంది ప్రేమలో పడుతూ వారి ప్రేమను విజయవంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మరికొందరు ప్రేమ విఫలం కావడంతో ఆ వ్యక్తితో ఉన్న అనుబంధం గురించి మరిచిపోయి జీవితంలో ముందుకు సాగుతారు. అయితే ప్రేమ విఫలమైతే చాలామంది ఆ బాధ నుంచి బయటపడలేక తన జీవితం మరొకరికి అంకితం కాకూడదనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో చూసాము. తాజాగా అలాంటి ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడని తను లేని జీవితం తనకు అవసరం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని కలబురగి జిల్లాకు చెందిన శృతి అనే యువతి పియుసి సెకండియర్ చదువుతోంది. ఈమెకు
బసవన బగేవది ప్రాంతానికి చెందిన హన్మంత అనే బంధువుల అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ కలిసి సినిమాలకు, పార్కులకు వెళ్లేవారు. అయితే ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు ఈ విషయం గురించి మాట్లాడుతూ వరసకి బావ మరదలు అవుతారు కనుక వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పెళ్లి నిశ్చయించడంతో ఆ జంట ఎంతో సంతోషపడ్డారు.

అయితే వీరు సంతోషం ఎక్కువ కాలం నిలవ లేదనే చెప్పాలి. ఒకరోజు పొలం పనులు చేసుకుంటూ హనుమంతు పొరపాటున కాలుజారి బావిలో పడ్డారు. దీంతో ఆయన మృతి చెందడంతో శృతి కన్నీరు మున్నీరుగా విలపించింది.ప్రేమించిన వాడితో జీవితం పంచుకొని సంతోషంగా గడపాలని ఎన్నో కలలు కన్న ఆమె జీవితం కలగానే మిగిలిపోయింది.ఇక అదే విషయాన్ని తలుచుకుంటూ శృతి బాధపడుతూ వుండగా తన తల్లిదండ్రులు ఆమెను ఓదారుస్తూ ఇంతటితోనే జీవితం ఆగిపోలేదు ముందుకు సాగాలని చెప్పారు ఈ క్రమంలోనే తనకు పెళ్లి చేయడానికి వేరే సంబంధాలు వెతుకుతున్న నేపథ్యంలో తాను ప్రేమించిన వ్యక్తి లేకపోతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా కూతురు కూడా దూరమవడంతో రెండు కుటుంబాలలో ఎంతో విషాదఛాయలు అలముకున్నాయి.