చనిపోయాక ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి సూసైడ్ చేసుకున్న యువకుడు..

సమాజంలో కొందరు వ్యక్తులు వింతవింతగా ఆలోచిస్తారు. ముఖ్యంగా యువత మాత్రం కొన్ని చేయొద్దన్న పనులు చేస్తూ ఉంటారు. దాని వల్ల కొన్నిసార్లు ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు. మామూలుగా చనిపోతున్నాము అంటే ఎవరైనా భయపడతారు. కానీ ఇక్కడ ఓ యువకుడు చనిపోయాక ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని ఆత్మహత్య చేసుకున్నాడు.

తమిళనాడు తిరునల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్ అనే 19 యువకుడు.. లా సెకండియర్ చదువుతున్నాడు. ఇక ఇతడు హాస్టల్ లో ఉండగా.. గదిలోనే ఉరి వేసుకొని చనిపోయాడు. అంతే కాకుండా సుసైడ్ నోట్ కూడా రాశాడు. చనిపోయాక ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇలా చేస్తున్నా.. నేను దాచిన రూ. 5వేలు అమ్మకి ఇవ్వండని రాసాడు.