Sad News: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. కర్మకాండ చేసిన తండ్రి.. ఎక్కడో తెలుసా?

Sad News: ప్రస్తుత కాలంలో కులాంతర వివాహాలు ప్రేమ పెళ్లిళ్లు సర్వ సాధారణమయ్యాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది యువత తమ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహాలు చేసుకోగా మరికొందరు వారిని ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు పెళ్లి చేసుకోవడంతో పరువు పోయినట్టు వారిని చంపడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మహబూబ్ నగర్ జిల్లా, చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవిఅనే యువతి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఈ క్రమంలోనే వారి ప్రేమ విషయాన్ని పెద్దల ముందు ఉంచడంతో వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు తిరస్కరించారు. దీంతో ఆ జంట ఈనెల 13వ తేదీ ఇల్లు వదిలి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆ తండ్రి ఎంతో మనస్తాపం చెందాడు.

ఈ క్రమంలోనే తన మాట కాదని ఇల్లు దాటి వెళ్ళిన తన కూతురు ఆరోజే చనిపోయిందని భావించి ఆ తండ్రి ఏకంగా గుండు గీయించుకుని తన బిడ్డకు కర్మకాండలు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా కూతురి ఫోటోకి దండ వేసి కర్మకాండలు జరిపించడంతో గ్రామం మొత్తం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.తన మాట కాదని చెప్పినందుకు ఆ తండ్రి మనస్థాపంతో తన కూతురు పై ఉన్న కోపాన్ని ఈ విధంగా బయటపెట్టారు.