ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం!

delhi fire

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని గోకుల్‌పురి బస్తీలోని ఓ పూరి గుడిసెలో చెలరెగిన మంటలు క్రమంగా ఆ ప్రాంతం మొత్తం వ్యాపించాయి. సుమారు 60 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మంటలు అర్పడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తోంది. 13 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నాలుగు గంటల కష్టపడి మంటలను ఆర్పినట్లు డీఎస్పీ దేవేశ్‌ కుమార్‌ మహ్లా చెప్పారు. ఘటనా స్థలంలో ఏడు మృతదేహాలు లభించాయని, వాటిని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.