ఏపీ మంత్రివ‌ర్గ‌ భేటీలో తీసుకున్న నిర్ణ‌యాలు ఇవే!

Total confusion in Andhra BJP

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం జ‌రిగిన మంత్రి మండ‌లి సమావేశం ముగిసిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై నిర్ణ‌యాలు తీసుకున్నారు. వాటిలో కొన్నింటికి సంబంధించి అంశాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి యాక్ట్ 2006లో 3, 7 సెక్షన్ లను సవరణ చేస్తూ కేబినేట్  నిర్ణ‌యించింది. అలాగే పగటిపూట 9గంటల విద్యుత్ రైతులకు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కేబినేట్ లో చర్చ సాగింది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కరువు నివారణ అభివృద్ది ప్రాజెక్ట్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయడంపైనా, గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిధులు పరిహారం కేటాయింపు పై కేబినేట్ లో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

మరో రెండు వేల కోట్ల రూపాయల లోను తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీతో ఏపిఐఐసికి అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసే అంశంపై కేబినేట్ నిర్ణ‌యించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కివ్స్ డిపార్ట్ మెంట్ లో ఒక పోస్ట్ క్రియేట్ చేస్తూ కేబినేట్ ఆమోదం తెలిపింది. అలాగే 420 టీచర్ పోస్టులకు 178 నాన్ టీచింగ్ పోస్ట్ లకు ఆమెదు తెలిపే అవ‌కాశం ఉంది. శ్రీకాకుళం, ఒంగోలులో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ క్నోలెడ్జి అండ్ టెక్నాలజీ లో పోస్టులు క్రియేట్ చేస్తూ కేబినేట్ అమోదానికి ఛాన్స్ ఉంది.

31 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించేందుకు కేబినేట్ లో నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. సిఐడి విభాగంలో 9జూనియర్ స్టెనోలను, 10 జూనియర్ అసిస్టెంట్లను, 10 టైపిస్ట్ ల పోస్టింగ్ లను ఏర్పాటు చేస్తూ కేబినేట్ ఆమోదం తెలిపే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ యాక్ట్ ఆర్డినెన్స్ 2020 జారీకి, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీలో 17పోస్టులకు అనుమతిస్తూ కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం. ఐదు కోట్లతో కర్నూలు జిల్లాలో గొర్రెల పెంపక శిక్షణాకేంద్రం ఏర్పాటు చేసేందుకు కేబినేట్ లో చర్చ. తొమ్మిదిన్నర కోట్లతో కర్నూలు జిల్లాలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు కేబినేట్ లో అమోదానికి ఛాన్స్ ఉంది. ఆచార్య ఎన్ జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు హోం సైన్స్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్ల ఏర్పాటుకు కేబినేట్ లో అమోదం. వీటితో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, మండ‌లి వ్య‌తిరేకించిన బిల్లుల‌పైనా చ‌ర్చ సాగింది.