ఏఎం ర‌త్నంకు ప‌వ‌న్, క్రిష్ బ‌ర్త్‌డే విషెస్.. ఫొటోలు వైర‌ల్

బంగారం లాంటి ఇండియ‌న్ ప్రొడ్యూస‌ర్ ఏఎం ర‌త్నం. త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఖుషీ చేస్తూ మ‌ళ్ళీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, క్రిష్ కాంబినేష‌న్ సినిమాతో వార్త‌ల‌లోకి వ‌చ్చిన టేస్ట్‌ఫుల్ ఫిలిం మేక‌ర్ ఈ రోజు త‌న బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఏఎం ర‌త్నంకు ప‌లువురు ప్ర‌ముఖుల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా ఏఎం ర‌త్నంకు బొకే అందించి మ‌రీ విషెస్ తెలియ‌జేశారు.


ఏఎం ర‌త్నం ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌ధాన పాత్ర‌లో క్రిష్ ద‌ర్శ‌కుడిగా ఓ చారిత్రాత్మ‌క చిత్రం చేస్తున్నారు. క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ పెట్టిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. తాజాగా ‘హరిహర వీరమల్లు’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చారిత్రక నేపథ్యానికి కల్పిత పాత్రల్ని కలబోసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌జ్రాల‌ను దొంగిలించే వ్య‌క్తిగా క‌నిపిస్తార‌ని స‌మాచారం. వ‌చ్చే నెల‌లో మ‌రో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్..రానాతో క‌లిసి అయ్య‌ప్ప‌నుష్ కోషియుమ్ అనే చిత్ర రీమేక్‌లో పాల్గొంటుండ‌గా, ఈ మూవీకి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్త‌య్యాక తిరిగి క్రిష్ సినిమా కోసం పని చేయ‌నున్నాడు. ఏఎం ర‌త్నం ఈ సినిమా కోసం భారీగానే బ‌డ్జెట్ పెడుతున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, షూటింగ్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను జనసేన పార్టీ గోదావరి జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ యిర్రింకి సూర్యారావు కలిశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల తాజా రాజకీయ పరిణామాలను జనసేనానికి వివరించారు. ఈ సమావేశంలో నిర్మాత ఏఎం రత్నం కూడా పాల్గొన్నారు.