పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా ప్రియాంక మోహన్

ఆస్కార్ విజేత అయిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం యువ ప్రతిభావంతుడు. దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జత కట్టారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15 న ముంబైలో ప్రారంభమైంది. కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఈ వారం ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ రోజు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చారు.

‘డాక్టర్‌’, ‘డాన్‌’, ‘గ్యాంగ్‌ లీడర్’, ‘శ్రీకారం’ వంటి చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్‌ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. ఈ నటి సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. ఆమె తన రూపం, శైలితో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటను తెరపై చూడాలని సినీ ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసున్నారు.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్‌ ముంబై మరియు పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుజీత్ ఎక్కడా రాజీపడకుండా అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు.

అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్
సంగీతం: ఎస్ థమన్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: డీవీవీ దానయ్య
రచన, దర్శకత్వం: సుజీత్
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్