దర్శకుడు వినయ్ బాబు దర్శకత్వంలో కొత్త చిత్రం!

దర్శకుడు వినయ్ బాబు దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కనుంది. ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’ (2022), ‘సుందరాంగుడు’ (2022), ‘శ్రీమతి బంగారం’ (2016) అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన వినయ్ బాబుకు ఆ చిత్రాలు దర్శకుడిగా మంచి పేరునే తెచ్చిపెట్టాయి. టేకింగ్ పరంగా వినయ్ బాబు శైలి నచ్చి తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త.. అమెరికా ఎన్.ఆర్.ఐ నిర్మాతగా మారి భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు.

యాక్షన్ తో పాటు పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ నూతన చిత్రంలో హాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు నటించనున్నట్టు దర్శకుడు వినయ్ బాబు తెలిపారు. ఇది ఒక ఫవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమని, ఇందులో వినోదం కూడా మిళితమై ఉంటుందని, అందుకే హాలీవుడ్, టాలీవుడ్ నటీ నటులు నటించనున్నారని, ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు.

తెలియజేస్తామని చెప్పారు. ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’, ‘సుందరాంగుడు’ అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన వినయ్ బాబుకు ఆ చిత్రాలు విడుదలై ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ నే తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూ ఆదరిస్తున్నారని, అందుకే మంచి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసులను కురిపించుకుంటున్నాయని, ఆ ఉత్సాహంతోనే.. తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలతోనే మాలాంటి దర్శకులు సినిమాలు రూపొందిస్తున్నారని దర్శకుడు వినయ్ బాబు పేర్కొన్నారు.

ఇప్పుడు తాజాగా నా దర్శకత్వలో వచ్చే ఈ చిత్రం విజువల్ పరంగా, కథాపరంగా సరికొత్తగా ఉండబోతోందని, ఖర్చుకు వెనుకాడకుండా మా నిర్మాత అమెరికా ఎన్.ఆర్.ఐ భారీగా నిర్మించడానికి ముందుకొచ్చారని, అన్ని కమర్షియల్ హంగులతోపాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందని, ప్రముఖ హీరో, హీరోయిన్స్ నటించే ఈ నూతన భారీ చిత్రానికి సంబంధించి త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని దర్శకుడు వినయ్ బాబు తెలిపారు.