మేమూ నష్టపోయాం..ఆదుకోండి!

విజయ్‌ దేవరకొండ సమాజ సేవ అంటే ఎప్పుడు ముందుంటాడు. ముఖ్యంగా ప్రతీ ఏటా తన పుట్టిన రోజున జనాలకు ఏదో విధంగా హెల్ప్‌ చేస్తుంటాడు. అదే విధంగా ఖుషీ సినిమా సక్సెస్‌ కావడంతో తన వంతుగా వంద కుటుంబాలకు లక్ష చోప్పున కోటి రూపాయలు పంచుతానని సక్సెస్‌ మీట్‌లో ప్రకటించాడు.

దీనిపై చాలా మంది విజయ్‌ దేవరకొండను ప్రశంసించగా.. టాలీవుడ్‌ ప్రొడక్షన్‌ సంస్థలలో ఒకటైన అభిషేక్‌ పిక్చర్స్‌ విజయ్‌ చేసిన ప్రకటనపై వింతగా స్పందించింది. ఈ సంస్థ సినిమాలను డిస్టిబ్యూట్ర్‌ కూడా చేస్తుంది. కాగా విజయ్‌ నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాను ఈ సంస్థే రిలీజ్‌ చేసింది.

అయితే ఈ సినిమా వల్ల అభిషేక్‌ పిక్చర్స్‌ రూ. 8 కోట్లు నష్టపోయింది. ఇక ఇప్పుడు అదే విషయంపై ట్వీట్‌ వేస్తూ విజయ్‌ను ట్యాగ్‌ చేసింది. ఇప్పుడు మీరు మీ పెద్ద మనసుతో వంద కుటుంబాలకు కోటి రూపాలయలు ఇవ్వడం మంచిదే.. అయితే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాకు తాము నష్టపోతే ఎవరూ స్పందించలేదు. దయచేసి మమ్మల్ని, మా ఎగ్జిబ్యూటర్‌లు మరియు డిస్టిబ్యూట్రర్‌లకు అండగా ఉండాలంటూ ట్విట్టర్‌హ్యాండిల్లో పేర్కొంది.

ఐతే ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు అభిషేక్‌ పిక్చర్స్‌ను సోషల్‌ మీడియాలో ఆడుకుంటున్నారు. నష్టాలు వస్తే నిర్మాతను అడగాలి కానీ.. ఇలా హీరోను అడగడం ఏంటని నిలదీస్తున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా మీకు కోట్లలో లాభాలు తెచ్చిపెట్టింది. అప్పుడు విజయ్‌కు ఇచ్చారా? అంటూ కడిగేస్తున్నారు. ఇక ఇదే ప్రశ్న బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? అంటూ అభిమానులు కౌంటర్‌ ఇస్తున్నారు!