ఇంట్లో ప్రియుడితో ఉండగా చూసిన కూతురు… ప్రియుడితో కలిసి చంపిన తల్లి

వివాహేతర సంబంధాలు రోజురోజుకు కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. కాసేపటి సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కన్న బిడ్డలను, కట్టుకున్న భార్య, భర్తలను కూడా చంపడానికి వెనకాడడం లేదు. ఓ మహిళ ప్రియుడితో కలిసి ఉండగా తన పదేళ్ల కూతురు చూసింది. వారి బాగోతాన్ని తండ్రితో చెబుతానని అంది. అంతే ఆ పాపానికి తన కూతురును చంపేసింది ఆ మహిళ. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

హర్యానాలోని కర్నాల్ పట్టణానికి చెందిన లక్ష్మీకి  12 ఏండ్ల క్రితం వివాహమైంది. ఈమెకు 10 సంవత్సరాల సోనమ్ అనే కూతురు ఉంది. లక్ష్మీ భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్ష్మీకి గత సంవత్సరం అమిత్ కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం వారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా వారిద్దరి మధ్య సంవత్సరం నుంచి సంబంధం కొనసాగుతోంది.

భర్త పనికి వెళ్లగా, కూతురు స్కూలుకు వెళ్లగా లక్ష్మీ తన ప్రియుడిని ఇంటికి  పిలుపించుకునేది. ఇంట్లోనే వారు కలిసేవారు. లక్ష్మీ భర్త పనికి వెళ్లగా సోనమ్ కు సెలవు కావడంతో సోనమ్ ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. ఇదే సమయంలో లక్ష్మీ తన ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. వారిద్దరు ఇంట్లో కలిసుండగా సోనమ్ అప్పుడే వచ్చింది. వారిద్దరు ఏకాంతంగా గడుపుతుండడాన్ని సోనమ్ చూసింది. డాడికి చెబుతానని తల్లితో అన్నది. దీంతో లక్ష్మీ భయపడింది.

 తన ప్రియుడు అమిత్ తో కలిసి సోనమ్ ని ఊపిరాడకుండా చేసి లక్ష్మీ చంపేసింది. ఆ తర్వాత సోనమ్ బాడీని సమీపంలోని నదిలో పడేశారు. ఏం తెలియనట్టు లక్ష్మీ తన భర్తతో కలిసి బిడ్డ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నదిలో సోనమ్ డెడ్ బాడీ తేలడంతో పోలీసులు డెడ్ బాడీ స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో అది హత్యగా తేలింది.

దీంతో పోలీసులు కేసును లోతుగా విచారించడంతో లక్ష్మీ భయంతో అసలు విషయం చెప్పింది. దీంతో షాకైన పోలీసులు లక్ష్మీ, ఆమె ప్రియున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.