యుద్ధం వస్తే వెళ్లి సైన్యంలో చేరుతానన్న టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పివోకేలో ఉగ్ర సంస్థల స్థావరాల పై భారత వైమానిక దళం జరిపిన దాడుల పై మాజీ ఫైటర్. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే…

“ఐఏఎఫ్ మాజీ ఎంసీసీ ఫైటర్ పైలట్ గా తన హృదయం ఉప్పొంగుతోంది. మీరేజ్ 2000 పైలట్ల నైపుణ్యం, శైర్యం అద్భుతం. యుద్ద వీరులకు అభినందనలు. యుద్ధం వచ్చే అవకాశం ఉంటే సైన్యం మాజీ సైనికులను పిలుస్తది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా నేను వెళ్తాను. దేశం ఎవరికి తలవంచదు. భారత్ ఎటువంటి వారినైనా తిప్పి కొడుతుంది.” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.