గుండెల్ని పిండేస్తున్న ఆ యువతి పెళ్లి కథ

పెళ్లి అనగానే కొంచెం ఆనందం, కొంచెం టెన్షన్ వీటన్నింటిని కలగలిపి కొత్త జీవితం పై ఆశలెన్నో. పెళ్లయ్యాక కాబోయే వారితో ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ కలలలో తేలిపోతారు. ఇండేనేషియాకు చెందిన ఇన్తన్ స్యారీ, రియో నందా కు వివాహం కుదిరింది. నవంబర్ 11, 2018న వీరి పెళ్లి జరగాలి. కానీ వారి పెళ్లి జరగకుండా ఓ విషాదం వారి జీవితాన్ని నాశనం చేసింది.

అక్టోబర్ 29న ఇండోనేషియా విమానం లయన్ ఎయిర్ క్రాష్ అయి చనిపోయిన వారిలో రియో నందా కూడా ఉన్నారు.  జకార్తాలో విమానం ఎక్కిన కొన్ని నిమిషాల్లోనే విమానం క్రాష్ కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి కుదిరిన తర్వాత రియో ఇన్తతో సరదాగా ఓ మాట అనే వాడట. “ఒక వేళ నవంబర్ 11 వరకు నేను తిరిగి రాకపోతే నీ కోసం నేను సెలెక్ట్ చేసిన వెడ్డింగ్ డ్రెస్ వేసుకో. మంచి మేకప్ వేసుకో. మిస్ షీలా దగ్గర తెల్లని గులాబీ పువ్వులు తీసుకో. మంచి ఫోటోలు దిగి నాకు పంపించు.” అని స్యారీతో రియో సరదాగా అనే వాడట. కానీ ఇప్పుడు ఆ మాటలే నిజమయ్యాయి.

దీంతో బరువెక్కిన హృదయంతో తనకు కాబోయే భర్త తన మధ్య లేకున్నా తనకిచ్చిన మాట ప్రకారం నవంబర్ 11న రియో చెప్పినట్టు గానే స్యారీ రెడీ అయ్యింది. కానీ ఆ ఫోటోలు పంపడానికి రియో ఈ లోకంలో లేడు.  కొద్ది రోజుల క్రితమే స్యారీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో స్యారీ  ఈ విషయాన్ని తెలిపింది.

“ఈ బాధను నేను వర్ణించలేను. కానీ నీ కోసం నవ్వుతున్నాను. విషాదంగా ఉండలేను. నువ్వు కోరుకుంటున్నట్టుగానే నేను ధృఢంగా ఉండాలనుకుంటున్నా. ఐ లవ్ యూ రియో నందా అని రియోను తలుచుకుంటూ స్యారీ రాసింది.  పెళ్లి కూతురిలా ముస్తాబైన రియో ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. రియో సోదరితోను ఫోటోలు దిగి మంచి సోదరిని ఇచ్చావు” అని రాసింది. 

ఇప్పడు ఈ ఫోటోలు, ఆమె రాసిన మాటలు ఇండేనేషియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది ప్రపంచానికి కూడా తెలిసింది. కాలం విధించిన కఠిన పరీక్షకు వెరవకుండా దైర్యంగా నిలిచి దానిని ఎదుర్కొన్న స్యారీని అంతా కొనియాడారు.