పెళ్లయిన మరుసటి రోజు భార్య మీద కంప్లైంట్ ఇచ్చిన పెళ్ళికొడుకు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ముక్కు ముఖం తెలియని వారు కూడా ఆన్లైన్లో పరిచయాలు పెంచుకొని ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఆన్లైన్ లో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్న వారిలో చాలామంది మోసపోతున్నారు. ఇటీవల ఒక యువకుడు ఆన్లైన్లో అమ్మాయితో పరిచయం పెంచుకొని కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ శోభనం రోజు తన భార్య గురించి అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు. ఈ సంఘటన హర్యానా లో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే…హర్యానా లోని దర్గాపూర్‌లో నివాసం ఉంటున్న సుఖాలాల్ అనే 30ఏళ్ల యువకుడికి సోషల్ మీడియా ద్వారా ఒక యువతి పరిచయం ఏర్పడింది. అయితే కొంతకాలానికి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా ఆన్లైన్ పరిచయం ద్వారా ఒకరికొకరు దగ్గరైన యువతీ యువకులు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి వారి అంగీకారంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఆనందంగా వివాహం చేసుకున్నారు. ఇక ఇరువురి వివాహం ఎంతో సంతోషంగా జరగటంతో వివాహం జరిగిన మరుసటిరోజే కుటుంబ సభ్యులు వారు ఇరువురికి శోభనం ఏర్పాట్లు చేశారు.

అయితే.. శోభనం రోజు గదిలోకి వచ్చిన పెళ్లికూతురు గురించి పెళ్ళికొడుకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. తాను ఎంతగానో ప్రేమించి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక ట్రాన్స్ జెండర్ అని తెలిసి షాక్ అయ్యాడు. తన భార్య గురించి అసలు విషయం బయటపడటంతో మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తాను మోసపోయానాని జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి వాపోయాడు. అంతే కాకుండా తనని మోసం చేసినందుకు విడాకులు తన భార్య భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.