బెజవాడలో “బంపరాఫర్” లవ్ స్టోరీ… లింగమార్పిడి తర్వాత ట్విస్ట్!

“బంపరాఫర్” సినిమాలో ఆలీ – వేణు మాదవ్ మధ్య జరిగిన కామెడీ సన్నివేశాల సంగతి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో పూర్వ జన్మలో ప్రేమికులమని నమ్మిన ఇద్దరు మగవాళ్లూ… ఒకరికి తెలియకుడా ఒకరు లింగమార్పిడి చేయించుకుని ఇద్దరూ మహిళలుగా మారిపోతారు. అలా కాకపోయినా… కాస్త అటు ఇటుగా జరిగిన ఒక ప్రేమకథ తాజాగా విజయవాడలో వెలుగులోకి వచ్చింది.

విజయవాడలో ఇద్దరు యువకుల మధ్య నడిచిన ప్రేమకథ, అనంతరం జరిగిన ట్విస్ట్ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివరాళ్లోకి వెళ్తే… ఇద్దరు యువకులు కాలేజీలో చదువుకుంటూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసే కొంతకాలం జీవించారు. అనంతరం సమాజం ఏమనుకున్నా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీనికోసం అవయువ మార్పిడికి కూడా ప్లాన్ చేశారు.

అవును… విజయవాడకు చెందిన ఇద్దరు యువకులు నాగేశ్వరరావు – పవన్ లు బీఈడీ చదివారు. చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌ లో ఉన్నారు. అనంతరం పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి సంగతి తర్వాత ముందు లింగమార్పిడి చేయించుకోమని నాగేశ్వర రావు, తన ప్రియుడు పవన్ కు సలహా ఇచ్చాడు.

అనంతరం ఢిల్లీ తీసుకెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించి పవన్ పేరును భ్రమరాంభ గా మార్చాడు. అక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. లింగమార్పిడి చేయించుకున్న భ్రమరాంభతో అతని బాయ్ ఫ్రెండ్ నాగేశ్వరరావు పెళ్లికి నిరాకరించాడు. అనంతరం భ్రమరాంభగా మారిన పవన్ కు దూరంగా ఉంటూ వచ్చాడు. ఆఖరికి పెళ్లీ లేదు ఏమీ లేదని తేల్చి చెప్పాడు.

దీంతో… మోసపోయినట్లు గుర్తించిన భ్రమరాంభ… పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి ప్రియుడు నాగేశ్వర రావుపై ఫిర్యాదు చేసింది. దీంతో వ్యవహరం వెలుగులోకి వచ్చింది. మరి ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. అసలు ఈ వ్యవహారంపై ఎలాంటి సెక్షన్స్ పెడతారు.. అనేది వేచి చూడాలి!