మత్తులో ఉన్న మహిళ మీద నీచానికి పాల్పడిన డాక్టర్…. నిస్సహాయ స్థితిలో మహిళ!

ఈ సమాజంలో డాక్టర్లను దేవుడితో సమానంగా భావిస్తారు. అపాయంలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లను మొక్కుతారు. ఇలా గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ప్రజల ప్రాణాలను కాపాడవలసిన డాక్టర్లు కొంతమంది దారుణాలకు పాల్పడుతూ వారి వృత్తికి కళంకం తెచ్చే పనులు చేస్తున్నారు. కొంతమంది డాక్టర్లు డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే మరి కొంతమంది డాక్టర్లు వైద్యం పేరుతో మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి కోల్కతాలో వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్ళిన మహిళ పై డాక్టర్ లైగింక దాడికి పాల్పడ్డాడు.

వివరాలలోకి వెళితే… పశ్చిమ బెంగాల్ రాజధాని నగరమైన కోల్కతా కి చెందిన 39 ఏళ్ల మహిళ పిత్తాశయ సమస్యతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స కోసం కోల్కతాలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంది. ఇటీవల ఆమెకు ఆపరేషన్ కూడా చేశారు. అయితే ఆపరేషన్ చేసే ముందు పేషంట్ల కి మత్తు మందు ఇస్తారు. అలాగే ఆ మహిళకు కూడా మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేశారు. ఇక ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మహిళ ఇంకా మత్తులో ఉండగా ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్ లో ఎవరూ లేకపోవడంతో డాక్టర్ మహిళ ప్రైవేట్ భాగాలను చేతులతో తాకటమే కాకుండా గట్టిగా నొక్కాడు.

అయితే ఆ మహిళ మత్తులో ఉండటం వల్ల తన మీద లైగింక దాడి జరుగుతున్నట్లు గ్రహించిన కూడా అతని చర్యలను అడ్డుకోలేకపోయింది. ఇక మత్తు నుండి తేరుకున్న తర్వాత ఈ ఘటన గురించి కుటుంబ సభ్యులకు చెప్పిన మహిళ వారి సహాయంతో ఆ డాక్టర్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హాస్పిటల్ లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు వెల్లడించారు.