నిత్యం దైవరాధనలో ఉండాల్సిన పూజారి చేసిన పాడు పని తెలిస్తే షాక్..?

ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడంతో అక్రమ సంబంధాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ అక్రమ సంబంధాల కారణంగా భార్యాభర్తలు విడిపోవడమే కాకుండా వారి మధ్య గొడవలు పెరిగి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు . ఇటీవల ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక మహిళ తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఈ దారుణ సంఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…. ఒక మహిళ ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంది. ఈ క్రమంలో ఆమె కు ఒక పూజారి తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పెరిగి ఇద్దరిమధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో కొంతకాలం పాటు వారివురు సహజీవనం చేస్తున్నారు. ఇలా వీరిద్దరూ కొన్ని రోజులు సంతోషంగా సహజీవనం చేశారు. ఆ తర్వాత సదరు మహిళ కి మరొక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తితో కూడా పరిచయం పెరిగి అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఆ మహిళ తనని మోసం చేసి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న సంగతి తెలుసుకున్న పూజారి ఆమె మీద కోపం పంచుకొని ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 27 న ఆమెను పొలం వద్దకు రమ్మని చెప్పాడు. ఆమె రాగానే కోపం తో ఉన్న పూజారి… తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో ఆమె తల మీద దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. ఆ పూజారి అంతటితో ఆగకుండా ఆమె చెవులను కోసి రెండు బంగారు కమ్మలను తీసుకువెళ్లాడు. అయితే గత మూడు రోజులుగా మహిళ కనిపించకపోవడంతో ఆమె కోసం స్థానికులు గాలించగా పొలం వద్ద కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయట పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ పూజారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.