ఆదివారమే పల్స్ పోలియో చుక్కలు .. ప్రారంభించిన రాష్ట్రపతి

దేశ వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో  ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. 

తెలంగాణ వ్యాప్తంగా 35,12,333 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఆయా విభాగాలకు ఇప్పటికే అవగాహన కల్పించారు. 52,19,180 వ్యాక్సినేషన్ డోస్ లను కూడా సిద్దం చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  ఈ చుక్కలు వేయనున్నారు. చిన్నపిల్లలందరికి తప్పకుండా వేయించాలని అధికారులు కోరారు.