సీబీఎస్‌ఈ టాపర్ విద్యార్ధినిని ఏం చేశారో తెలుసా

సీబీఎస్ ఈ పరీక్షలో టాపర్ గా నిలిచి రాష్ట్రపతి నుంచి అవార్డు పొందిన చదువుల సరస్వతి ఆమె. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్ధిని ట్యూషన్ కు వెళుతుండగా కామాంధులు చిదిమేశారు. ఈ విషాద ఘటన వివరాలు తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే.

హర్యానాకు చెందిన విద్యార్ధిని సీబీఎస్ ఈ పరీక్షలో టాపర్ గా నిలిచింది. డిగ్రీ సెకండియర్ చదువుతున్న విద్యార్ధిని ట్యూషన్ కు వెళ్లి వస్తుండగా ముగ్గురు నిందితులు ఓ కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం పొలాల్లో చూసిన మరికొందరు విద్యార్దినిపై అత్యాచారం చేశారు. అనంతరం స్పృహ తప్పి ఉన్న యువతిని బస్టాండ్ సమీపంలో పారేసి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ కేసులో జీరో ఎఫ్ ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఓ పోలీసు అధికారి తెలిపారు. నేరం జరిగిన ప్రాంతం స్పష్టంగా తెలియక పోవడంతో ఏ స్టేషన్ పరిధిలో వస్తుందో తెలియక ఆలస్యమైందన్నారు. అందుకే జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రాంతం తెలిసిన తర్వాత కేసును బదిలీ చేస్తామని తెలిపారు. ఈ దారుణం పై పలువురు విచారం వ్యక్తం చేశారు.