కోరిక తీర్చలేదనే ముంబై మోడల్  మన్సీ హత్య

ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఆమె కూడా అతనిని స్నేహితునిగా నమ్మింది. కానీ అతను ఆమె క్లోజ్ గా ఉండేసరికి తన కోరికను తీర్చాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో దాడి చేసి అత్యాచారం చేశాడు. ఆ పై హత్య చేశాడు. ఇది గత ఏడాది ముంబై మోడల్ మన్సీ దీక్షిత్ హత్య కేసు విచారణలో బయటపడ్డ నిజం. అసలు వివరాలు ఏంటంటే…

మన్సీ దీక్షిత్ (20) కొత్తగా మోడలింగ్ రంగంలోకి వచ్చారు. తనకు అవకాశాలు పెంచుకునేందుకు అందరితో కూడా పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలోనే సయ్యద్ ముజమ్మిల్(19) అనే ఫోటోగ్రాఫర్ ఆమెకు పరిచయమయ్యాడు. ఫోటోగ్రాఫర్ కావడంతో స్టిల్స్ కోసం మన్సీ కూడా అతనితో క్లోజ్ గా మూవ్ అయ్యి అతని సలహాలు తీసుకునేది. మన్సీ క్లోజ్ గా మూవ్ కావడంతో సయ్యద్ కు ఆమె పై కన్ను పడింది. పలుసార్లు అక్కడ ఇక్కడ ఆఫర్లు ఉన్నాయని ఆమెను పిలిచి ఫోటో షూట్ చేసి పంపించాడు. ఇలా రెండు మూడు నెలలు గడిచినా మన్సీ మాత్రం అతనితో నార్మల్ గానే ప్రవర్తించింది. 

సయ్యద్ కు మాత్రం ఆమెను లొంగదీసుకోవాలనే ఆలోచన రోజు రోజుకు పెరిగిపోయింది. ఎలాగైనా మన్సీని లొంగదీసుకోవాలని సయ్యద్ ప్లాన్ వేశాడు. 2018 అక్టోబర్ 15న సయ్యద్ ఇంట్లో ఎవరూ లేరు. తనకు ప్రముఖ మోడలింగ్ వాళ్లు నీ యొక్క ఫోటో షూట్ లు కావాలని అన్నారని వెంటనే నీవు మా ఇంటికి వస్తే ఫోటో షూట్ చేసి వారికి పంపిస్తానని మాన్సికి ఫోన్ లో సమాచారమిచ్చాడు.

దీంతో అది నిజమని నమ్మిన మన్సీ సయ్యద్ ఇంటికి వచ్చింది. ముందుగా ప్లాన్ ప్రకారం ఆమెను కొన్ని ఫోటోలు దింపాడు. ఆ తర్వాత నేరుగా మాన్సితో తన కోరికను తీర్చాలని అడిగాడు. దానికి మాన్సి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య పెనుగులాట అయ్యింది. సయ్యద్ కోపంతో స్టూల్ తో మాన్సీ తలపై కొట్టాడు. మాన్సీ స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు మాన్సీ పై సయ్యద్ అత్యాచారం జరిపి తన కోరిక తీర్చుకున్నాడు. మాన్సీ బతికితే తన బండారం బయటపడుతుందని ఆమె చున్నీతోనే ఆమె మెడకు ఉరివేసి చంపాడు. ఆ తర్వాత మాన్సీ డెడ్ బాడీని ఓ బస్తాలో వేసాడు.

ముందుగా రాత్రి 11 గంటలకు ఓ క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్ డ్రైవర్ బస్తా బరువు చూసి అందులో ఏముందని అడిగాడు. ఏం లేదు స్వారీ మా బ్రదర్ వస్తున్నాడని క్యాబ్ ను క్యాన్సల్ చేశాడు. ఆ తర్వాత మరో కారును బుక్ చేసి డ్రైవర్ కు అనుమానం రాకుండా మాన్సి మృతదేహం ఉన్న బస్తాను తనే కారు డిక్కిలో వేశాడు. ఓ ఫుట్ పాత్ వద్ద కారును ఆపమని చెప్పి  ఆ బస్తాను అక్కడ వదిలి సయ్యద్ డ్రైవర్ కు అవుపడకుండా వెళ్లిపోయాడు. ఆ బస్తాను చూసి అనుమానం వచ్చిన డ్రైవర్ బస్త ఓపెన్ చేసి చూడగా అందులో మాన్సీ మృతదేహం కనిపించింది. దీంతో షాకైన డ్రైవర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. 

పోలీసుల విచారణలో ఆమె మోడల్ అని తేలింది. సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా విచారణ వేగవంతం చేశారు. సయ్యద్ ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. మన్సీ శరీరం, దుస్తులపై వీర్యాన్ని కనుకొన్నారు. దానిని కూడా ల్యాబ్ కు పంపించి సయ్యద్ వీర్యాన్ని కూడా పరీక్షకు పంపగా అది సయ్యద్ దేనని నిర్దారణ అయ్యింది. దీంతో సయ్యద్ ని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మోడల్ మాన్సిని దారుణంగా హతమార్చిన సయ్యద్ ను ఉరితీయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.