భారత కమాండర్ అభినందన్ ను చిత్రహింసలు పెట్టిన పాక్ ఆర్మీ (వీడియో)

యుద్ధ కమాండర్ అభినందన్ ను పాక్ ఆర్మీ చిత్రహింసలు పెట్టింది. మిగ్ 21 విమానం కూలిన తర్వాత పాక్ ఆర్మీ అభినందన్ ను అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న పాక్ ప్రజలు అభినందన్ పై దాడి చేశారు. ఆర్మీ జవాన్లు అభినందన్ చేతులు వెనక్కు విరిచి కట్టిపాడేశారు. ఆ సమయంలో అతని తలను నేలకు గట్టిగా అదిమిపట్టారు. అతనికి తీవ్ర రక్తస్రావం అయినా వదిలి పెట్టలేదు. దాని తర్వాత కళ్లకు గంతలు కట్టి ఓ వాహనంలో రహస్య ప్రదేశానికి తరలించారు. చిత్రహింసలు పెట్టి ప్రపంచ దేశాలను నమ్మించేందుకు పాక్ ఆర్మీ అబినందన్ తో మంచిగానే ఉన్నానని మాట్లాడించి ఓ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో అభినందన్ క్షేమం పై అంతా ఆందోళన చెందుతున్నారు. 

 

https://twitter.com/i/status/1100979043158163458