తొందర్లో కొత్త రు100 నోటు

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) కొత్త 100 రూపాయల నోటును మార్కెట్లోకి తీసుకురానుంది. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ నోటు వివరాలను ఆర్బీఐ తెలియజేసింది. గుజరాత్‌లోని ప్రఖ్యాత హెరిటేజ్ కట్టడమైన ‘రాణి కా వావ్’ చిత్తరువు నోటుకు వెనుకవైపు ఉంటుంది. జాతిపిత మహాత్మాగాంధీ నోటు ముందుభాగంలో ఉంటారు. లెవెండర్ కలర్‌లో నోటు ఉండబోతోంది. కాగా, కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చినా పాత రూ.100 నోట్లు చలామణిలో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.