కేంద్రం బంపర్ ఆఫర్.. ఉచితంగా రూ.లక్ష రూపాయలు సులువుగా పొందే ఛాన్స్!

Modi

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఎన్నో స్కీమ్స్ కు అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుంటే ఆ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ ను పూర్తిస్థాయిలో పొందవచ్చు. కేంద్రం ఉచితంగా లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తుండగా మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కాంటెస్ట్ లో పాల్గొన్న వాళ్లు సులువుగా లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంటుంది.

ఇండియా@75 పేరుతో మోదీ సర్కార్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యువ టూరిజం క్లబ్ కొరకు లోగో డిజైన్ చేసి ఆ లోగో సెలెక్ట్ అయితే మాత్రం సులువుగా లక్ష రూపాయలు గెలవవచ్చు. లోగో డిజైన్ చేయడం గురించి ఆసక్తిని కలిగి ఉంటే ఈ బంపర్ ఆఫర్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆసక్తి ఉన్న యువతీయువకులు ఈ పోటీలో పాల్గొని బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది.

2023 సంవత్సరం మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకొని ఈ పోటీలో సులువుగా పాల్గొనవచ్చు. మైగౌవ్ వెబ్ సైట్ ద్వారా ఇందుకోసం దరఖాస్తు చేసే అవకాశం అయితే ఉంటుంది. పోటీలో పాల్గొనే వారు పూర్తి వివరాలను కచ్చితంగా అందజేయాల్సి ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో లోగోలను డిజైన్ చేసినా ఒకే ఒక ఎంట్రీని మాత్రమే పంపించే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

నిబంధనలకు అనుగుణంగా లోగోను డిజైన్ చేసి డబ్బులను గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. 300 డీపీఐ రెజల్యూషన్‌తో ఈ లోగోలను తయారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అనుభవం కలిగి ఉన్నవాళ్లు ఈ పోటీలో పాల్గొంటే సులువుగా విజేతలుగా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.