ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు ఒకె

భారతీయ వ్యోమగాములను రోదసిలోకి పంపేందుకు ఉద్దేశించిన గగన్ యాన్ స్పేస్ ప్రోగ్రాం కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కింద దేశీయంగా తయారయిన వ్యోమనౌక నుంచి ముగ్గురు వ్యోమగాములను రోదసీలోకి పంపిస్తారు.  ప్రధాని నరేంద్రమోదీ  అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ అమోదం తెలిపిన ఈ కార్యక్రమానికి రు. 9023  కోట్లు ఖర్చువుతాయని అంచనా.ఈ వ్యోమగాములు మొత్తం ఏడు రోజుల పాటు అంతరిక్షంలో ఉంటారు.

 ఈ ముగ్గురు అంతరిక్ష పరిశోధకులను తీసుకువెళ్లేందుకు  జిఎస్ ఎల్ వి ఎంకె -3 నౌకను వాడతారు. ఇందులో వారం రోజులు పాటు ముగ్గురు పరిశోధకులు ఉండేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. గగన్ యాన్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేందుకు ఇస్రో జాతీయ పరిశోధణ సంస్థలతో,  పరిశ్రమలతో విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేస్తుంది.

గగన్ యాన్ కార్యక్రమం కింద 2020 నాటికి  ముగ్గురు పరిశోధకులను అంతరక్షంలోకి పంపాల్సి ఉంటుంది. ముగ్గురిని రోదసి లోకి పంపేముందుకు రెండు మానవరహిత ప్రయోగాలు జరగుతాయి.