మధ్యంతర బడ్జెట్ లో ముఖ్యాంశాలు ఇవే

మధ్యంతర బడ్జెట్ ను పీయూష్ గోయల్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది పేద, మధ్య తరగతి మరియు శ్రామిక కర్షక బడ్జెట్ అని గోయల్ అన్నారు. 

 బడ్జెట్ లోని మరిన్ని ముఖ్యాంశాలు…

* 12 కోట్ల మంది రైతులకు లబ్ది కలిగించేలా సరికొత్త సంక్షేమ పథకం.
* పూర్తి పారదర్శకంగా ఏడాదికి రూ. 6 వేలను పంటసాయంగా చెల్లిస్తాం.
* 2018 డిసెంబర్ నుంచి కార్యక్రమం అమలులోకి వచ్చినట్టు.
* గోకుల్ మిషన్ కు ఈ సంవత్సరం రూ. 750 కోట్ల కేటాయింపులు.
* గో ఉత్పాదకతను పెంచడం కోసం సరికొత్త ‘రాష్ట్రీయ కామ్ ధేన్ ఆయోగ్’
* పెన్షన్ విధానానికి మార్పులు.
* పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు.
* ఈఎస్ఐ లిమిట్ రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు.
* ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరిట మరో సరికొత్త స్కీమ్.
* నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది.
* రూ. 15 వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం.
* కొత్త పెన్షన్ విధానంలో నెలకు రూ. 3 వేలు అందిస్తాం.
* కొత్త పెన్షన్ విధానానికి రూ. 500 కోట్ల  కేటాయింపు.
* 10 కోట్ల మంది కార్మికులకు పెన్షన్ స్కీమ్ తో లాభం.
* గ్రాట్యుటీ లిమిట్ రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు.
* బ్యాంకుల రుణాలు రూ. 35,984 కోట్లకు పెరుగుదల.
* కిసాన్ క్రెడిట్ కార్డులపై 2 శాతం వడ్డీ రాయితీ.
* ఉజ్వల యోజన కింద 8 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు.
* ముద్ర యోజనలో రూ. 7.23 లక్షల కోట్ల రుణాలు.
* రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు.
* అవసరమనిపిస్తే అదనపు నిధుల కేటాయింపుకు సిద్ధం.
* కార్మికుల ప్రమాద బీమా రూ. 1.50 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంపు.
* 60 ఏళ్లు దాటిన కార్మికులంతా పెన్షన్ స్కీమ్ లో భాగస్తులే.
* కొత్తగా 10 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి.
* వన్ ర్యాంక్ – వన్య పెన్షన్ కోసం రూ. 35 వేల కోట్లు.
* త్వరలోనే ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు.
* కేంద్ర స్థాయిలో ప్రత్యేక మత్స్య శాఖ ఏర్పాటు.
* పశు సంవర్థక, మత్స్య పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ.
* ప్రధానమంత్రి కౌశల్ యూజన ద్వారా కోటి మంది యువతకు లబ్ది.
* రైల్వేలకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ. 64,587 కోట్లు.
* మిజోరం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం.
* బ్రాడ్ గేజ్ మార్గాల్లో ఇప్పటికే తొలగిపోయిన కాపలాలేని లెవల్ క్రాసింగ్ లు.
* ఈశాన్య భారతావని కూడా మౌలికరంగ అభివృద్ధిని చూస్తోంది.
* ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ. 15,166 కోట్ల కేటాయింపు.
* గడచిన ఐదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగింది.
* గడచిన ఐదేళ్లలో 34 కోట్ల జన్ ధన్ అకౌంట్ల ప్రారంభం.
* ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ. 12 లక్షల కోట్లు.
* 80 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య.
* ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు.
* ఇప్పటివరకూ ఉన్న పన్ను పరిమితి రూ. 2.50 లక్షలు
* సెక్షన్ 80సీ పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షలకు పెంపు.
* ఇక పేద, మధ్యతరగతి ప్రజలంతా 0 నుంచి 5 శాతం పన్ను పరిధిలో మాత్రమే.
* సినిమా పరిశ్రమ 12 శాతం జీఎస్టీ పరిధిలోకి.
* సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో.
* రోజుకు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం.
* దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను వదిలే సమస్యే లాదు.
* అందరినీ ఇండియాకు రప్పించి బకాయిలు వసూలు చేస్తాం.
* బినామీ ఆస్తుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని అటాచ్ చేశాం.
* 3 లక్షలకు పైగా బినామీ కంపెనీలను డీ రిజిస్టర్ చేశాం.
* గడచిన సంవత్సరం కోటి మందికి పైగా పన్ను చెల్లించారు.
* స్వతంత్ర భారతావనిలో ఇంతమంది నుంచి రిటర్నులు దాఖలు కావడం ఇదే తొలిసారి.
* వచ్చే ఐదేళ్లలో ఇండియా 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రూపాంతరం చెందుతుంది.
* ‘ఈజ్ ఆఫ్ బిజినెస్’ తో పాటే ‘ఈజ్ ఆఫ్ లివింగ్’
* మరిన్ని విమానాశ్రయాలు రానున్నాయి.
* ఇన్ లాండ్ వాటర్ వేస్ కు పెద్దపీట.
* పట్టణాలను మరింత పరిశుభ్రం చేస్తాం.
* శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలకు మరిన్ని కేటాయింపులు.
* డిజిటల్ ఇండియా కలను సాకారం చేసి చూపిస్తాం.
* అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలను డిజిటల్ మాధ్యమంగానే సాగేలా చర్యలు.
* ఇండియాను కాలుష్య రహిత భారతావనిగా మార్చేందుకు చర్యలు.
* ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని రాయితీలు.
* ట్రాన్స్ పోర్ట్ విప్లవంలో ప్రపంచానికే ఆదర్శంగా మారనున్న భారతావని.
* సరుకు రవాణా రంగంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం.
* ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తాం.
* గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు సమయం ఆసన్నమైంది.
* మేకిన్ ఇండియాలో భాగంగా గ్రామాలకు భారీ పరిశ్రమలను దగ్గర చేస్తాం.
* గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఇప్పటికే మారిపోయిన ఇండియా.
* గంగానదిని కాలుష్య రహితంగా మార్చి చూపుతాం.
* ఇందుకోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేయనున్నాం.
* అంతరిక్ష కార్యక్రమాలకు మరిన్ని నిధులను కేటాయిస్తాం.
* ప్రపంచ దేశాల శాటిలైట్లను నింగిలోకి చేర్చడంలో మనమే ముందున్నాం.
* ఆహార ఉత్పత్తులను మరింత సేంధ్రీకరిస్తాం.
* పురుగు మందులు వాడని పంటతో మరింత ఆరోగ్యం.
* 2025 నాటికి ప్రతి దేశ పౌరుడికీ ఆరోగ్య బీమా ఉంటుంది.
* వైద్య ఖర్చులకు ఒక్క రూపాయి కూడా పెట్టని పరిస్థితిని తీసుకు వస్తాం.
* ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపులో అతి త్వరలోనే నిర్ణయం.
* మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి చర్చించనున్నాం.
* జాతీయ విద్యా మిషన్ కు రూ. 38,572 కోట్లు.
* చైల్డ్ డెవలప్ మెంట్ స్కీమ్ కు రూ. 27,584 కోట్లు.
* ఎస్సీ, ఎస్టీల అభ్యన్నతికి రూ. 76 వేల కోట్లు.
* నెలకు వసూలవుతున్న పన్ను మొత్తం రూ. 97,100 కోట్లు.
* గడచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేరకు పెరిగాయి.
* జీఎస్టీ అమలుతో వినియోగదారులపై రూ. 80 వేల కోట్ల భారం తగ్గింది.
* చాలా నిత్యావసర వస్తువులు 5 శాతంలోపు పన్ను పరిధిలోనే ఉన్నాయి.
* రూ. 5 లక్షలలోపు సంవత్సరాదాయం ఉన్న వారికి ఫుల్ టాక్స్ రిబేట్.
* వారు కేవలం రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుంది.
* రూ. 6.50 లక్షల వరకూ వార్షికవేతనం ఉంటే, పీఎఫ్, బీమా, సేవింగ్స్ తదితర స్కీముల్లో పెట్టుబడులు పెట్టి ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.
* మూడు కోట్ల మంది టాక్స్ ప్లేయర్లకు లబ్ది.
* పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితి పెంపు.
* టీడీఎస్ పరిమితి రూ. 10 వేల నుంచి రూ. 40 వేలకు పెంపు.
* స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 40 వేల నుంచి రూ. 50 వేలకు పెంపు.
* ఇంటి అద్దెలపై టీడీఎస్ రూ. 180 లక్షల నుంచి రూ. 2.40 లక్షలకు పెంపు.
* కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ. 3.27 లక్షల కోట్లు.
* ప్రణాళికా వ్యయం రూ. 3.36 లక్షల కోట్లు.
* గత సంవత్సరంతో పోలిస్తే 13.3 శాతం పెరిగిన ప్రభుత్వం ఖర్చు