క‌త్తితో ఆఫీసుకెళ్లి భార్య‌ను పొడిచి చంపాడు!

భార్య మీద అనుమానం పెంచుకున్న ఓ కిరాత‌క భ‌ర్త దారుణానికి పాల్ప‌డ్డాడు. ఆమెను హ‌తమార్చ‌డానికి కుట్ర ప‌న్నాడు. త‌న భార్య ప‌నిచేస్తోన్న కార్యాల‌యానికి వెళ్లి ఆమెతో గొడ‌వ పెట్టుకున్నాడు. అంద‌రూ చూస్తుండ‌గా- ఆమెను క‌త్తితో పొడిచి చంపాడు. మ‌హారాష్ట్ర థానే జిల్లాలోని భ‌యాంద‌ర్‌లో మంగ‌ళ‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఆ భ‌ర్త పేరు కుమార్ బోహిర్‌. త‌న భార్య వీణ బోహిర్‌తో క‌లిసి కొంత‌కాలంగా భ‌యాంద‌ర్‌లో నివ‌సిస్తున్నాడు. వీణ స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థ‌లో ప‌నిచేస్తోంది. ఆమె ప‌ని చేసే కార్యాల‌యంలో తోటి ఉద్యోగితో వీణ‌కు అక్ర‌మ సంబంధం ఉంద‌నే అనుమానం పీడిస్తుండేది.

ఈ అనుమానంతోనే అత‌ను త‌ర‌చూ భార్య‌తో గొడ‌వ ప‌డుతుండేవాడే. ఈ క్ర‌మంలో- ఈ ఉద‌యం వీణ‌ ప‌నిచేస్తోన్న కార్యాల‌యానికి వెళ్లి, ఆమెతో ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. అంద‌రూ చూస్తుండ‌గా, వెంట తెచ్చుకున్న క‌త్తితో ఆమెను పొడిచి చంపాడు. కార్యాల‌య సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు సంఘ‌ట‌నాస్థలానికి చేరుకున్నారు. కుమార్‌ను అరెస్టు చేశారు.