ఏరియల్ సర్వేకెళ్లి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే

హెచ్ డీ కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏం చేసినా అది సంచలనంగానే మారుతుంది. ఇటీవల కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏరియల్ సర్వేకి వెళ్లిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఏం చేశారో మీరే చదవండి.

కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మైసూరు నుంచి హిరియా పట్టణం వరకు సీఎం కుమారస్వామి ఏరియల్ సర్వే చేశారు. ఆ సమయాన ఏరియాలను పరిశీలించాల్సిన కుమారస్వామి పేపర్ చదువుతూ కూర్చున్నారు. వందలాది గ్రామాలు నీట మునిగి, రోడ్ల వంతెనలు కొట్టుకుపోయి ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే పేపర్ చదువుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. బిజెపి కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని కుమారస్వామి విమర్శించారు.

ఏరియల్ సర్వేలో పేపరు చదువుతున్న సీఎం కుమారస్వామి