ఎన్నికల ముందు కమల్ కి భారీ షాక్ .. బీజేపీ కండువా కప్పుకున్న అరుణాచలం !

తమిళనాడు లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకి అన్ని పార్టీలు కూడా ఇప్పటి నుండే సన్నద్ధం అవుతున్నాయి. ఇక రజినీకాంత్ కూడా త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు కమల్ ఎన్నికల ప్రచారం లో జోరు చూపిస్తున్నారు. ఈ సమయంలో కమల్ కి భారీ షాక్ తగిలింది.

మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఏ అరుణాచలం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ట్యూటికోరిన్ జిల్లాకు చెందిన అరుణాచలం రాష్ట్ర ఎన్నికల కోసం కమల్ ప్రచారం చేస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ వేదికగా జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో బీజేపీ లీడర్ జవదేకర్ మాట్లాడారు.

తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నా. చాలా పార్టీలు దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలుగా ఉన్నాయి. కానీ, మా పార్టీయే మాకు కుటుంబం. అదే మాకు వాళ్లకు మధ్య తేడా. కచ్చితంగా చెప్తున్నా రాష్ట్ర ఎన్నికల్లో అద్భుత విజయం సొంతం చేసుకుంటాం’ అని అన్నారు.