సిడ్ని వన్డేలో భారత్ విజయలక్ష్యం 289 పరుగులు

మూడు వన్డేల సిరిస్ భాగంగా సిడ్నిలో శనివారం మొదటి వన్డే జరుగుతుంది. తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 288 పరుగులు చేసి 5 వికెట్ల కోల్పోయింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్ తడబడ్డారు. దీంతో ఆసీస్ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ అధిక పరుగులు చేయలేక పోయారు.  చివరి 10 ఓవర్లలో ఆసీస్ బ్యాట్స్ మెన్ 93 పరుగులు చేశారు. 

ఖవాజా 59, షాన్ మార్ష్ 54, హ్యండ్స్ కోంట్ 73 , స్టోనిస్ 43 పరుగులు చేశారు. భారత బౌలర్లు భువనేశ్వర్, కుల్డీప్ లు రెండు వికెట్లు తీయగా జడేజా ఒక్క వికెట్ తీశారు.