న్యూజిలాండ్ తో T20 మ్యాచ్ లో భారత్ టార్గెట్ 220 పరుగులు

వెల్లింగ్టన్ లో జరుగుతున్న t20 మ్యాచ్ లో న్యూజిలాండ్ 219 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 219 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయలక్ష్యం 220 పరుగులుగా నిర్దేశింపబడింది.

కివీస్ బ్యాట్స్ మెన్స్ సైఫర్ట్ 84, మున్రో 34, విలియమ్సన్ 34, మిచెల్ 8, టేలర్ 23, గ్రాండ్  హోం 3, సాట్నర్ 7, కుగ్లీజిన్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లు పాండ్యాకు 2, కుమార్, అహ్మద్, కెహెచ్ పాండ్యా, చాహల్ లు ఒక్కో వికెట్ తీశారు.

ముందుగా తడబడ్డ కివీస్ బ్యాట్స్ మెన్స్ ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోర్ చేశారు. ఒకనొక దశలో భారత బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు కివీస్ బ్యాట్స్ మెన్ తడబడ్డారు. ఆ తర్వాత బ్యాట్స్ మెన్స్ విజృంభించడంతో కివీస్ స్కోరు పరుగులు పెట్టింది. దీంతో 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది. 220 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతుంది.