ఒకేసారి ఇద్దరు ప్రియులతో ఇంట్లో భర్తకు పట్టుబడ్డ భార్య

వివాహేతర సంబంధాలు కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. ఏకంగా ఓ మహిళ తన ఇంట్లోనే ఇద్దరు ప్రియులతో కలిసి ఉండడాన్ని చూసిన భర్త షాకయ్యాడు. వెంటనే తేరుకొని వారిని ఇంట్లోనే బంధించి బంధువులను, ఇతరులను పిలిచి భార్య భాగోతాన్ని అందరికి చూపించాడు. ఆ తర్వాత వారికి దేహశుద్ది చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా జిల్లా కులారియా గ్రామానికి చెందిన  యువకునికి గత సంవత్సరం ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. కానీ గత ఆరు నెలలుగా భార్య ప్రవర్తనలో తేడాను భర్త గమనించాడు. అయితే ఆ యువతికి పెళ్లికి ముందే ఇద్దరు అబ్బాయిలతో సంబంధం ఉంది. ఇంట్లో వారు పెళ్లి సంబంధాలు చూడడంతో తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకుంది. అయినా తన మాజీ ప్రియులతో సంబంధం కొనసాగిస్తూనే ఉంది.

పలుమార్లు తన ప్రవర్తన పై భర్త ప్రశ్నించిన ఏం తప్పు చేయనట్టుగా సమాధానమిచ్చింది. భర్త రోజు డ్యూటికి వెళ్లగానే ఇంటికి ఒక్కో రోజు ఒక్కో అబ్బాయి వచ్చి వెళ్లేవాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారు భర్తకు చెప్పారు. దీంతో భార్య మీద భర్త నిఘా పెట్టాడు. మంగళవారం భర్త డ్యూటికి వెళ్లినట్టుగా వెళ్లి బయటే దాక్కున్నాడు. ఆయన డ్యూటికి వెళ్లగానే  భార్య తన ఇద్దరు ప్రియులకు ఫోన్ చేసి ఇద్దరిని ఒకేసారి తన ఇంటికి రమ్మంది. దీంతో గంటసేపట్లోనే ఇద్దరు ప్రియులు ఇంటికి వచ్చారు.

ఆ యువతి ఏకంగా ఇద్దరి ప్రియులతో ఒకేసారి గడుపుతుండగా భర్త ఎంట్రీ ఇచ్చాడు. తన ఇంటి బయట బేడాలు వేసి బంధువులను, చుట్టుపక్కల వారిని పిలిచి తన భార్య భాగోతం బట్టబయలు చేశాడు. ఈ ఘటనతో కంగుతిన్న భార్య, ప్రియులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకొని ముగ్గురికి దేహశుద్ది చేశారు. అబ్బాయిలను చేతులతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు వీరిని కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.