పంజాబ్‌లో ‘డంకీ’.. సినిమాకి ట్రాక్టర్స్‌లో థియేటర్స్‌కి వస్తోన్న ప్రేక్షకులు

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులను హృదయాలను డంకీ చిత్రం గెలుచుకుంటోంది. యావత్ సినీ ప్రపంచానికి ఈ సినిమా పండగను తీసుకొచ్చింది. పంజాబ్ రాష్ట్రానికి వస్తే ఈ సినిమా అసలు కథ ఇక్కడే నుంచే సినిమాలో ప్రారంభమవుతుంది. దీంతో అక్కడ సందడి మరింత గొప్పగా ఉంది.

డంకీ సినిమా పంజాబ్ వాసులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో అక్కడి వారు కుటుంబాలతో కలిసి ఈ సినిమాను చూడటానికి ట్రాక్టర్స్‌‌లో థియేటర్స్‌కు వెళుతుండటం విశేషం. ఈ ఏడాదిలో విడుదలైన ఫీల్ గుడ్ మూవీగా డంకీ ప్రేక్షకాదరణ పొందుతోంది. హాలీడే సీజన్ కావటంతో ఆదరణ రోజు రోజుకీ పెరుగుతోంది. కుటుంబ ప్రేక్షకులకు ఇదొక ట్రీట్‌లా ఉందని అందరూ బావిస్తున్నారు.

‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లుగా వ‌ర్క్ చేశారు.

https://x.com/boworldwide/status/1739312104933626199?s=46&t=PusltWkTns46RNMqjWxAeA