జీఎస్ఎల్వీ-ఎఫ్11 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోట ప్రయోగ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్11 ప్రయోగం జరిగింది. జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి వాహక నౌక ప్రవేశ పెట్టనుంది. కాగా, ఈ ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. భారత్ పంపిస్తున్న35 వ సమాచార ఉపగ్రహం జీశాట్-7ఏ. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన జీశాట్- 7ఏ ఎనిమిదేళ్లపాటు సేవలందించనుంది. ముఖ్యంగా భారత వాయుసేన అవసరాల కోసం దీనిని వినియోగిస్తారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ప్రయోగం విజయవంతం కావడంతో దేశమంతా ఆనందాలు వెల్లివిరిసాయి.
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్11
