నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా టెన్త్ క్వాలిఫికేషన్ ఉండి జాబులు లేక బాధపడేవారికి ఇదొక అద్భుత అవకాశంగా చెప్పవచ్చు. ఇంటలిజెన్స్ బ్యూరోలో 1054 పోస్టులకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కార్యనిర్వాహక, సెక్యూరిటి, అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 10 వ తేది ఫీజు చెల్లింపునకు చివరితేది. 27 ఏళ్లకు మించకుండా పదో తరగతి అర్హత ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్దులకు ఏజ్ లిమిట్ లో సడలింపు ఉంటుంది. WWW.NCS.GOV.IN , WWW.MHA.GOV.IN ద్వారా అభ్యర్దులు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి.
అక్టోబర్ 20 వ తేది నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 10 వతేది వరకు ఫీజు చెల్లింపు చేయవచ్చు. నవంబర్ 13 వతేది వరకు అప్లికేషన్ల సబ్ మిట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫీజు పే మరియు అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్ లైన్ లో నే చేసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మంచి జీతాలతో ఉద్యోగాలున్నాయని పదో తరగతి చదివి ఆపేసిన వారికి ఇదోక అద్బుత అవకాశమని విద్యావేత్తలు అంటున్నారు. అంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా ఉద్యోగాలు పడుతున్నాయి. రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ల ద్వారా ప్రతి నెలలో కూడా అనేక నోటిఫికేషన్లు వస్తాయని వాటిపై కూడా అభ్యర్దులు అవగాహన పెంచుకొని సెంట్రల్ జాబ్ లకు ట్రై చేయాలని వారు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చితే కేంద్ర ఉద్యోగాలకు కాంపిటేషన్ తక్కువ ఉంటుందన్నారు.
