టీవీ ప్రేక్షకులకు శుభవార్త

గత కొంత కాలంగా కేబుల్ బిల్లుల పెంపు పై ఆందోళన నెలకొంది. కొత్త నిబంధనలు వచ్చాయని దానికనుగుణంగా మార్పులు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో టివి ప్రేక్షకుల్లో ఆందోళన నెలకొంది. టివి ప్రేక్షకులకు ఊరట కలిగించేలా ట్రాయ్  నిర్ణయాన్ని ప్రకటించింది. 100 ఉచిత ఛానళ్లు లేదా ప్రేక్షకులు కోరుకునే 100 పే చానళ్లను 153. 40 రూపాయలకే అందించాలని ఆదేశాలు జారీ చేసింది.  

కేబుల్ కనెక్షన్ అయినా, డిటిహెచ్ అయినా ఇదే ధరకు అందించాలని సర్వీసు ప్రొవైడర్లకు సూచించింది. దీని పై వివరాలకు ఈ నెల 31 వరకు ఆపరేటర్లను వీక్షకులు సంప్రదించాలని తెలిపింది. దీని పై సందేహాలుంటే 011- 23237922 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది.