పత్తి రైతులకు శుభవార్త

దేశంలో 8 మిలియన్ల మంది పత్తి రైతులకు శుభవార్త. బీటీ కాటన్ (జన్యుమార్పిడి) విత్తనాల ధరను తగ్గిస్తూ కేంద్రప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్యాకెట్ బీటీ పత్తి విత్తనాలపై కేంద్రం విధించిన రాయల్టీ ఫీజును ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. బీటీ కాటన్ విత్తనాలపై రాయల్టీ ఎత్తివేత వల్ల రైతులకు పత్తివిత్తనాలు తక్కువ ధరకు లభించనున్నాయి. బీటీ కాటన్ విత్తనాల ధరను తగ్గించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ ప్రధానికి లేఖ రాశారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.