Hemananda Biswal:మాజీ సీఎం క‌న్నుమూత‌.. ప్రముఖుల సంతాపం

ఒడిశా మాజీ సీఎం హేమానంద బిస్వాల్ ఇకలేరు. 83 ఏళ్లు బిస్వాల్ భువ‌నేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఒడిశాకు ముఖ్యమంత్రిగా రెండు సార్లు పని చేశారు హేమానంద‌. ఒడిశాలో తొలి గిరిజ‌న‌ ముఖ్యమంత్రిగా ఇయనే. మెుదటి సారి డిసెంబ‌ర్ 7, 1989 నుండి మార్చి 5, 1990 వ‌ర‌కు సీఎంగా పని చేసిన ఆయన.. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ 6, 1999 నుంచి మార్చి 5, 2000 వ‌ర‌కు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పలువురు ప్రముఖులు హేమానంద బిస్వాల్ పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.