విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

కేరళలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. పాలక్కడ్ లో ఈ దారుణం జరిగింది. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారి ఆత్మహత్య గురించి బంధువులకు ముందేగానే సమాచారం అందినప్పటికీ వారు వెళ్లే సరికి ఆ కుటుంబం  తనువు చాలించింది. సమీపంలోని నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.ఆర్థిక కష్టాల కారణంగా ఆ కుటుంబం సుసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వారు ఇంట్లో ఓ సూసైడ్ నోట్ దొరికింది. వారి మృతితో బంధువులు రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.