India: భారత దాడులపై చైనా ఆందోళన… సంయమనం పాటించాలంటూ సూచన

భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పరిధిలోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన నేపథ్యంలో చైనా తీవ్ర ప్రతిస్పందనను వ్యక్తం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట చేపట్టిన ఈ దాడులను తక్షణం నిలిపివేయాలని చైనా అధికార ప్రతినిధి బీజింగ్‌లో మీడియాకు తెలిపాడు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరకుండా భారత్, పాకిస్థాన్ ఇద్దరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు.

చైనాకు భారత్, పాక్ లతో సవాళ్లతో కూడిన సంబంధాలున్నాయి. చైనాకు పాకిస్థాన్ కీలక మిత్రుడే కావచ్చు, కానీ భారత్‌తోనూ భారీ వాణిజ్య, భౌగోళిక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తీసుకున్న సైనిక చర్యలను చైనా ఆందోళనతో చూస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. “ప్రస్తుత పరిస్థితి జఠిలం కాకుండా చూడాలి. శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని చైనా పిలుపునిచ్చింది.

భారత్ వైపు నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ సిందూర్ చేపట్టారు. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు ప్రత్యేక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అంచనా.

ఇప్పుడు చైనా వంటి గ్లోబల్ ప్లేయర్లు సెంటర్‌స్టేజ్‌లోకి రావడం, పరిస్థితి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం విశేషం. భారత్ ఏమి నిర్ణయిస్తుందో, పాకిస్థాన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో, అంతర్జాతీయ సమాజం దీనిని ఎలా చూడబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

నోటిదూల బాలయ్య || Director Geetha Krishna EXPOSED Balakrishna Padma Bhushan Award Secrets || TR