కేంద్రం సూపర్ స్కీమ్.. వడ్డీ లేకుండా రూ.50 వేల రుణం పొందే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ గురించి సరైన అవగాహన లేక చాలామంది ఈ స్కీమ్స్ అందిస్తున్న బెనిఫిట్స్ ను పొందలేకపోయారు. వడ్డీ, గ్యారంటీ లేకుండా లోన్ ను పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పీఎం స్వనిధి యోజన పేరుతో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా తొలిసారి కేవలం 10000 రూపాయల లోన్ పొందవచ్చు.

ఆ మొత్తాన్ని సరిగ్గా చెల్లించిన తర్వాత 20,000 రూపాయల లోన్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా సరిగ్గా చెల్లిస్తే ఆ తర్వాత 50,000 రూపాయల లోన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. రుణాన్ని సకాలంలో చెల్లించే వాళ్లకు ఈ లోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. www.pmsvanidhi.mohua.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

రేషన్ కార్డ్, పాస్ పోర్ట్ ఫోటోలతో పాటు బ్యాంక్ పాస్ బుక్, ఆధార్, ఓటర్ కార్డ్ ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న సూపర్ స్కీమ్స్ లో ఈ స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. ఎలాంటి గ్యారంటీ లేకుండా ఈ లోన్ ను పొందే ఛాన్స్ ఉంటుంది.

ఈ స్కీమ్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వీధి వ్యాపారులకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆన్ లైన్ లో కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.