బ్రేకింగ్ న్యూస్… జమ్మూ బస్టాండ్ లో బాంబు పేలుడు

జమ్మూ కాశ్మీర్ లో బాంబు పేలుడు జరిగింది. జమ్మూ బస్టాండ్ లో ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. బస్సులో గ్రెనేడ్ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

జమ్మూ పోలీసులు హై అలర్ట్ ప్రకటించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరిన్ని పేలుడులు జరిగే అవకాశం ఉందని పోలీసులు అలర్ట్ ప్రకటించారు.